కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే అరూరి.
వరంగల్ మండల పరిధిలోని 3,14 డివిజన్లకు చెందిన 34 లక్షల రూపాయల 34మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పంపిణి చేశారు. 3వ డివిజన్ కొత్తపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జన్ను శిభారాణి అనిల్, తూర్పాటి సులోచన సారయ్య, నేరెళ్ల రాజు లింగం కోటి . షేక్ ఆదాం డివిజన్ ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.