చివరి గింజనూ కొంటాం- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్
- తెలంగాణలో రైతాంగానికి ప్రోత్సాహం
- నష్టపోయిన ప్రతి పంటకూ పరిహారం
- మిల్లుల వద్ద 24 గంటలు దిగుమతి • తూకంలో కోత విధిస్తే చర్యలు
పెద్దపల్లి, జిల్లా:- రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన చివరి గింజనూ కొంటాం. ఇటీవల అకాల వానలతో దెబ్బతిన్న పంటలన్నింటికీ ఎకరానికి 10వేల చొప్పున పరిహారం ఇస్తాం.’ అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, వృద్ధాప్య, దివ్యాంగ శాఖల మంత్రి కొ ప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కారు రైతాంగా నికి ప్రోత్సాహం అందిస్తున్నదని చెప్పారు. సోమవారం ధాన్యం కొనుగోళ్లపై పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో మండలి చీఫ్ విప్ భానుప్రసాద రావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, కలెక్టర్ సర్వే సంగీతా సత్యనారాయణతో కలిసి అధికా రులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల తీరుపై కలెక్టర్ మంత్రికి వివ రించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్క రించి కొనుగోలుకు ఇబ్బందులు రాకుండా చూ డాలని కలెక్టర్కు మంత్రి సూచించారు. అనం తరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. పెద్ద పల్లి జిల్లాలో 3.49 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. వర్షాలతో పంటలు నష్టపోయిన రైతు లకు మొదటి విడుత ఎకరానికి 10 వేల చొ ప్పున పరిహారం మంజూరు చేశామని తెలిపా రు. కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాస్థాయి ఆఫీస ర్లను మండలానికి ప్రత్యేకాధికారులుగా నియ మించామని చెప్పారు. రైస్ మిల్లుల వద్ద 24 గం టలు ధాన్యం దిగుమతి చేసేలా చర్యలు చేపట్టా మన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తూకంలో కోత పెడితే బాధ్యులైన రైస్ మిల్లర్లపై కఠిన చర్య లకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం రాష్ట్ర ప్రభుత్వం రైతు అనుకూల విధానాలతో పెద్దపల్లి జిల్లాలో సాగువిస్తీర్ణం గణనీయంగా పె రిగిందన్నారు. ఏటా రూ. 10వేల కోట్లు వెచ్చిం చి సాగుకు ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు.. నీటి తీరువా రద్దుచేసి ఉచితంగా సాగునీరు అం దిస్తున్నామని చెప్పారు. రైతుబంధు, రైతు బీ మా పథకాలతో అన్నదాతకు భరోసానిస్తున్నా మని పేర్కొన్నారు. సకాలంలో ఎరువులు, విత్త నాలు సరఫరా చేస్తున్నామని తెలిపారు. జిల్లా లోని 303 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 3.49 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పారు. ఇప్పటివరకు 92. 750 వేల టన్నుల ధాన్యం కొని 89 వేల టన్నులను రైస్ మిల్లులకు తరలించామని తెలిపారు. గతేడాది ఈ సమ యానికి కేవలం 80 వేల టన్నులు కొంటే ఈ యేడు అదనంగా మరో 12 వేల టన్నులను కొ నుగోలు చేశామని తెలిపారు. రైస్ మిల్లర్ల వద్ద స్థలం కొరత కారణంగా వడ్ల తరలింపులో కొంతమేర ఇబ్బంది కలిగిందన్నారు.
ప్రతిపక్షాల రాద్ధాంతం..
ప్రతిపక్షాలు రైతుల ముసుగులో రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ రాక, విత్తనాలు, ఎరువులు అందక రైతులు అరిగోస పడ్డారని గుర్తుచేశారు. దేశంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రాల్లో కొనుగోలు కేంద్రాలను ఎత్తేశారని, కేవలం 15 శాతం ధాన్యాన్నే ప్రభు త్వాలు కొంటున్నాయని చెప్పారు. జిల్లాలో ఆ కాల వానలతో 6910 ఎకరాల్లో పంటలు నష్ట పోయిన 5790 మంది రైతులకు ఎకరానికి 10 వేల చొప్పున 76.91 కోట్ల పరిహారం మంజూరు చేశామని తెలిపారు. రెండో విడుత సైతం ఎకరానికి 10 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ధాన్యం సేకరణలో ఏమైనా సమ స్యలు ఎదురైతే అధికారుల దృష్టికి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అద నపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, డీపీఆర్వో తోట వెంక టేశ్, డీఆర్డీవో శ్రీధర్, జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి, కో ఆపరేటివ్ అధికారి మైఖేల్ బోస్ తదితరులు పాల్గొన్నారు.