Andhra Pradesh

తుఫాన్ ప్రభావంతో పంట పొలాలను నష్టపోయిన రైతులను పరామర్శించిన మంత్రి విడదల రజిని

చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, తూబాడు, బుక్కాపురం గ్రామాలలో తుఫాన్ ప్రభావంతో పంట పొలాలను నష్టపోయిన రైతులను పరామర్శించి పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ మించాగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని జగనన్న ప్రభుత్వంలో రైతును రాజుగా చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జగనన్న ప్రభుత్వంలో రైతుకు అన్ని విధాలుగా జగనన్న అండగా ఉంటారని భరోసా కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *